భార్యను బైక్ కట్టి ఇడ్చికెళ్లిన దుర్మార్గుడు.. తిట్టిపోస్తున్న నేటిజన్స్.. వీడియో వైరల్..!

Divya
ఈమధ్య మహిళల పైన జరిగే దాడులు రోజురోజుకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.. ముఖ్యంగా భర్తలే భార్యలను సైతం శాడిస్ట్ గా హింసిస్తూ ప్రవర్తిస్తున్నారు. కొంతమంది వంట చేయడం రాదని దుస్తులు సరిగ్గా వేసుకోలేదని వేధింపులకు గురి చేస్తున్న సందర్భాలను కూడా మనం చూస్తూనే ఉన్నాము. మరికొన్ని చోట్ల ఆడవాళ్లు సైతం తమకు తామే తక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు.. మరి కొంతమంది ఒకరిని కట్టుకొని మరొకరితో ఎఫైర్ వంటి నడిపిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కూడా భార్యలను భర్తను కొడుతూ ఉంటారు.

అయితే ఇప్పుడు రాజస్థాన్లోని జరిగిన ఒక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్లోని నౌగర్లో ఒక షాకింగ్ ఘటన వైరల్ గా మారుతున్నది. నహర్ సింగ్ పురా గుండా గ్రామంలో జరిగిన ఒక సంఘటన వైరల్ గా మారుతున్నది. ప్రేమా రామ్ మేక్ వాల్ అనే వ్యక్తి తన భార్యతో ప్రతిరోజు గొడవ పడుతూ ఉండేవారట. ముఖ్యంగా తాగి వచ్చి చాలా రచ్చ చేసే వారిని.. దీంతో పది నెలల క్రితం ఒక మహిళను 2 లక్షల రూపాయలకి కొన్నాడట. దీంతో తన భార్యను ప్రతిరోజు కూడా టార్చర్ పెట్టేవారట.

అంతేకాకుండా చాలా హీనంగా ఆమె పైన బరితెగించే వారిని అక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే తాజాగా తన భార్యను బైక్ కు కట్టేసి గ్రామంలో ఈడ్చుకుంటూ వచ్చిన సంఘటన ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. అయితే అక్కడున్న వారందరూ కూడా అతడిని ఆపి ప్రయత్నం మాత్రం అసలు చేయకుండా చూస్తూ ఉండిపోయారు. ఆ మహిళ కాపాడండి అంటూ అరుపులు కేకలు పెట్టినప్పటికీ కొంతమంది ఈ వీడియోని సీక్రెట్ గా తీసి మరి సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు. చివరిగా ఆమెను ఒక ఇంటి దగ్గరికి తీసుకువెళ్లి వదిలేసినట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు పని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు.ఈ వీడియో చూసిన పలువురు  నేటిజన్ సైతం ఆ వ్యక్తి పైన ఫైర్ అవుతున్నారు.. ఇలాంటివారిని కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: