వైరల్: రక్షాబంధన్ రోజున రాఖి ఎప్పుడు కడితే మంచిదో తెలుసా..?

Divya
రేపటి రోజున రక్షాబంధన్ పండుగ జరగబోతోంది.. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున ఈ రాఖీ పండుగను సైతం జరుపుకుంటారు. ఆరోజున సోదరీమణులు తమ సోదరుడికి మనికట్టు పైన ప్రేమ ఆప్యాయతతో కలిసి రక్షిత ధారాన్ని సైతం కడతారు. అంతేకాకుండా సోదరీమణులు కూడా తమ సోదరులను దీర్ఘాయుష్షుతో ఉండమని ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే సోదరులు కూడా తమ ప్రియమైన సోదరీమణులను ఎప్పుడు కాపాడుతామని వాగ్దానం చేస్తారు అయితే ఇది ఎన్నో ఏళ్లగా వస్తూనే ఉంది.

రక్షాబంధన్ పండుగను శ్రావణమాసంలో శుట్లపక్ష పౌర్ణమి రోజున మాత్రమే జరుపుకుంటారు .ఈసారి పూర్ణిమ తిది ఆగస్టు 19వ తేదీన తెల్లవారుజామున 3:04 నిమిషాలకే ప్రారంభమవుతుందట. అదే రోజు రాత్రి 11:05 గంటలకు సైతం ముగుస్తుందట. భద్ర సమయం ఎప్పుడూ ఉంటుందంటే ఆగస్టు 19న భద్ర పుంచ్ ఉదయం 9:51 నుంచి 10:53 ఉదయం వరకు ఉంటుంది.. ఇక భద్రముఖము 10:53 నుంచి మధ్యాహ్నం 12:37 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 నిమిషాలకు భద్రయాత్ర ముగుస్తుందట.

జ్యోతిష్యం ప్రకారం భద్ర అనేది చాలా అశుభకరమైన సమయంగా పరిగణిస్తారు. ఇలాంటి సమయాలలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదు. ఆగస్టు 19న మధ్యాహ్నం 1:30 తర్వాత మాత్రమే రాఖీ కట్టాలట.. రాఖీ కట్టడానికి ముఖ్యమైన సమయం 1:43 నుంచి 4:20 వరకు కట్టడం మంచిదట. ఆ సమయంలో ఎవరైనా సరే రాకి కట్టవచ్చు. రాఖీ కట్టాలి అనుకునేవారు కేవలం 2 గంటల 37 నిమిషాలు సమయం మాత్రమే ఉంటుంది. ఇది అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణంలోకి తీసుకుంటున్నారు.. అలాగే ప్రదోషకాలంలో కూడా రాఖీ కట్టవచ్చు అది సాయంత్రం 6:56 నుంచి రాత్రి 9:07 వరకు ఉంటుందట.

ఇక రాఖీ ఎందుకు కట్టాలనే విషయానికి వస్తే.. లంకాధిపతి రావణుడు సోదరి అతని మనికట్టుకు సైతం రాఖీ కడుతుంది.అది ఒక ఏడాది లోనే నాశనం అవుతుందని మన గ్రంధాలు తెలియజేస్తున్నాయి. భద్ర అనేది కూడా శని దేవుడు సోదరి అని అందుకే ఎవరైనా సరే భద్రలో ఏ శుభకార్యం చేయకూడదని పండితులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: