మెట్రో రైలులో దుర్గామాత మండపం.. చూస్తే మీ కళ్ళను మీరు నమ్మలేరు?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగ రంగ వైభవంతో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అందరికి వినాయక చవితి సందర్భంగా ఏకంగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించుకుని తొమ్మిది రోజులపాటు ఎంతో నిష్టగా పూజలు చేసిన భక్తులందరూ కూడా ఇక ఇప్పుడు దుర్గాదేవిని ప్రతిష్టించుకుని మరింత నిష్టగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పాలి. దీంతో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పండుగ శోభ సంతరించుకుంది.

 దుర్గా నామస్మరణతో దేశం మొత్తం భక్తి పారవశ్యంలో  మునిగి తేలుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక దుర్గామాతను ప్రతిష్టించుకున్న భక్తులు వారి అభివృద్ధికి తగ్గట్లుగా మండపం నిర్మించుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఒక గణేష్ మండపాలతో పోల్చి చూస్తే దుర్గామాత మండపాలు అంగరంగ వైభవంగా ముస్తాబు చేయడం కూడా చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని అయితే భూలోక స్వర్గాన్ని తలపించే విధంగా ఇలా మండపాలను సిద్ధం చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది తమ క్రియేటివిటీని చూపిస్తూ ఇలా మండపం నిర్మించడం ద్వారానే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి దుర్గామాత మండపం గురించే.

 ఏకంగా మెట్రో ట్రైన్ లోనే దుర్గామాత మండపం పెట్టారు. అదేంటి మెట్రో ట్రైన్ లో దుర్గామాత మండపం ఏర్పాటు చేయడం అంటే అలా ఎలా పర్మిషన్ ఇస్తారు అని ఆశ్చర్యపోతున్నారు కదా. అయితే అది నిజమైన మెట్రో ట్రైన్ కాదు. ఏకంగా దుర్గామాత మండపాన్ని మెట్రో ట్రైన్ లాగా రూపొందించారు. క్రియేటివిటీకి కాదేది అనర్హం అనట్లుగా పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో భక్తులు ఇలా వినూత్నంగా దుర్గామాత మండపం రూపొందించారు. అచ్చం మెట్రో రైలును పోలి ఉన్నట్లుగా మండపాన్ని తీర్చిదిద్దారు. ఇందులోకి వెళ్తే మెట్రోలోనికి వెళ్ళిన అనుభూతిని ఇస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి నెటిజెన్స్ అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు.
Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: